ఖమ్మం: ఓపెన్ స్కూల్ ఖమ్మంజిల్లా కో-ఆర్డినేటర్గా మద్దినేని పాపారావును నియమిస్తూ విద్యాశాఖాధికారి ఎస్.యాదయ్య శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కారేపల్లి మండలంలోని ఎంపీయూపీఎస్ గాదేపాడు పాఠశాలలో పనిచేస్తున్న పాపారావును ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్గా నియమించారు. ఈ మేరకు శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కో ఆర్డినేటర్గా పనిచేసిన అవధానుల మురళీకృష్ణకు ముదిగొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోస్టింగ్ ఇచ్చారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాపారావుకు పీఆర్టీయూ నాయకులు కట్టా శేఖర్రావు, డీవీ రామన్, డీఈఓ కార్యాలయ ఉద్యోగులు వై శ్రీనివాసరావు, దేవేందర్, నగేష్, ఎన్ శ్రీనివాసరావు తదితరులు అభినందనలు తెలిపారు.