కొత్తగూడెం క్రైం, జనవరి 6 : నేటి బాలలే రేపటి పౌరులని, వారిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుందని ఎస్పీ డాక్టర్ వినీత్ గంగన్న అన్నారు. ‘ఆపరేషన్ స్మైల్-9’ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, లేబర్ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, పోలీసు బృందాలతో సమన్వయ సమావేశాన్ని ఎస్పీ తన కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జనవరిలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా నెల రోజులపాటు 14ఏళ్ల లోపు పిల్లలు, వీధిబాలలను రెస్క్యూ హోమ్కు తరలిస్తున్నట్లు తెలిపారు.
బాలలను సంరక్షించి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. చిన్నారులను ఎలా రక్షించాలనే అంశాలను చర్చించారు. ఆపరేషన్ స్మైల్-9లో భాగంగా జిల్లావ్యాప్తంగా 5ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ బానోత్ నందిరామ్, షీ టీమ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్ఎస్సై రమాదేవి, వెల్ఫేర్ జిల్లా అధికారి లెనీనా స్వర్ణలత, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్స్ అంబేద్కర్, సాధిక్పాషా, సుమిత్రాదేవి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి హరికుమారి, లీగల్ అధికారి శివకుమారి పాల్గొన్నారు.