మధిర టౌన్, ఫిబ్రవరి 5 : మధిర పట్టణంలోని వైరానది ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీమృత్యుంజయస్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ, ఆలయ పునఃనిర్మాణ ప్రతిష్ఠ ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ సభాపక్షనేత నామా నాగేశ్వరరావు, ఖమ్మం జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్రాజు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. కార్యక్రమంలో శివాలయం చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, నాయకులు మొండితోక జయాకర్, వాసిరెడ్డి నాగేశ్వరరావు, బిక్కి ప్రసాద్, కనుమూరి వెంకటేశ్వరరావు, కరివేద సుధాకర్రావు, గుర్రం రామారావు, బొగ్గుల భాస్కర్రెడ్డి, వై.వీ.అప్పారావు, అరిగె శ్రీనివాసరావు, బత్తుల శ్రీనివాసరావు, డోకుపర్తి సత్యంబాబు, హరీశ్ పాల్గొన్నారు.
వైరాటౌన్, ఫిబ్రవరి 5 : వైరా రిజర్వాయర్ వద్ద దాసాంజనేయస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం సందర్భంగా ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ సీతారాముల కల్యాణ మహోత్సవం జరిపించడం మంచి శుభపరిణామమన్నారు. కల్యాణానికి విచ్చేసిన భక్తులకు అన్నదానం చేశారు. మార్క్ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, బానోతు విజయబాయి, మున్సిపల్ చైర్మన్ జైపాల్, బీజేపీ నాయకులు బీపీ నాయక్, ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ నిర్వాహకులు, చింతనిప్పు వెంకటయ్య, రామకృష్ణ, ఏలూరి వెంకటేశ్వరరావు, పి.లక్ష్మయ్య పాల్గొన్నారు.