చండ్రుగొండ, డిసెంబర్ 20: మాతా శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకే ప్రభుత్వం న్యూట్రిషన్ కిట్లను గర్భిణులకు అందిస్తున్నదని ఎన్సీడీ ప్రాజెక్టు జిల్లా అధికారి డాక్టర్ మణికంఠ అన్నారు. ప్రభుత్వ అందజేసిన న్యూట్రిషన్ల కిట్లను మంగళవారం పరిశీలించి మాట్లాడుతూ గర్భిణులకు నాలుగు నెలల తర్వాత పోషకాల అవసరం అధికంగా ఉంటుందన్నారు. ప్రతి గర్భిణికి కిట్టును అందజేస్తామన్నారు. మండలానికి 108 కిట్లు వచ్చాయన్నారు. న్యూట్రిషన్ కిట్లలో నెయ్యి, బాదం, హార్లిక్స్, ఐరన్ సిరప్, కప్, స్పూన్లు ఉంటాయన్నారు. ప్రతి పీహెచ్సీలో బుధవారం నుంచి కిట్ అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ వెంకటప్రకాశ్, వైద్య సిబ్బంది ఇమామ్, శ్రీనివాస్, శంకరమ్మ, లక్ష్మి పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి, డిసెంబర్ 20: మాత, శిశు మరణాల సంఖ్య తగ్గించేందుకు న్యూట్రిషన్ కిట్లను గర్భిణులకు బుధవారం ఉదయం ఎర్రగుంట ప్రభుత్వ ఆస్పత్రిలో అందజేస్తామని వైద్యురాలు ప్రియాంక తెలిపారు. గర్భిణులకు పంపిణీ చేయనున్న కిట్లను ఆమె పరిశీలించి మాట్లాడారు. పోషకాహారంతో రక్తహీనత సమస్య తగ్గటంతోపాటు, తల్లిబిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఆమె వెంట వైద్య సిబ్బంది ఉన్నారు.