ఖమ్మం సిటీ, జనవరి 4: నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో గురువారం నుంచి ఈ నెల 13 వరకు ఐటీసీఎఫ్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా టీ 20 క్రికెట్ (మెన్స్) పోటీలు నిర్వహిస్తున్నట్లు కేపీఎల్ చైర్మన్ డాక్టర్ కూరపాటి ప్రదీప్ తెలిపారు. బుధవారం నగరంలో మీడియాకు వివరాలు వెల్లడించారు.
పోటీల్లో శ్రీలంక, నేపాల్ దేశాలతోపాటు రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్ప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, జమ్మూకాశ్మీర్తో పాటు వివిధ రాష్ర్టాలకు చెందిన జట్లు తలపడతాయన్నారు. గతంలో మహిళా టీ 20 పోటీలను అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించామన్నారు. వరుసగా నాలుగు దఫాలుగా టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో ఫెడరేషన్ డైరెక్టర్లు సందీప్ ఆర్య, నరేశ్, సహాయకుడు వీర్ల రవి పాల్గొన్నారు.