ఖమ్మం, ఫిబ్రవరి 27 : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి(బనారస్, కాశీ)లో మంగళవారం చైర్మన్ రమేశ్ విధురియ అధ్యక్షతన జరిగిన పెట్రోలియం సహజవాయువు పార్లమెంటరీ స్థాయి సంఘ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు.
దేశంలోని ఉత్తరాది రాష్ర్టాల్లో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సరఫరాకు సంబంధించిన తీరుతెన్నులు, నెలకొన్న సమస్యలు, వాటి పరిషారానికి చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశం చర్చించింది. సమావేశంలో స్థాయి సంఘ సభ్యులతోపాటు సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.