మణుగూరు టౌన్, అక్టోబర్ 24 : బీఆర్ఎస్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం విజయదశమి సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలనలో అన్నివర్గాలకూ లబ్ధి చేకూరేలా మ్యానిఫెస్టోలో నిర్ణయించారన్నారు. అన్ని వర్గాల సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని, తెలంగాణ ప్రజలందరూ నమ్ముతున్నారన్నారు. కులవృత్తులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా ప్రణాళిక రూపొందించారన్నారు. మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మ్యానిఫెస్టోలోని రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన కొత్త నిబంధన, మహిళా సాధికారత కోసం, సౌభాగ్యలక్ష్మి, స్వశక్తి సంఘాలకు సొంత భవనాలు, పేదల ప్రజల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి, రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం వంటి పథకాలను వివరించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో పోశం నర్సింహారావు, అడపా అప్పారావు, ఊకంటి ప్రభాకర్రావు, ముత్యం బాబు, కుర్రి నాగేశ్వరరావు, గుడిపూడి కోటేశ్వరరావు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, జావీద్, నూకారపు రమేశ్, కృష్ణ, వట్టం రాంబాబు, సకిని బాబురావు, పాకల రమాదేవి, రమ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
కరకగూడెం, అక్టోబర్ 24 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండలంలోని అనంతారంలో విప్ రేగా సమక్షంలో 50 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు బీఆర్ఎస్లోకి వెల్లువలా చేరుతున్నారన్నారు. పినపాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, అక్కిరెడ్డి వెంకటరెడ్డి, అత్తె నాగేశ్వరరావు, సత్యనారాయణ, రాజబాబు పాల్గొన్నారు.