ఖమ్మం, ఏప్రిల్ 12: సీపీఐ నాయకుడు పగడాల మల్లేశ్ కుమారుడు పగడాల భరత్ మృతి పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. భరత్ మరణ విషయం తెలుసుకున్న అజయ్కుమార్.. ఫోన్ ద్వారా మల్లేశ్ను పరామర్శించారు. భరత్ మృతి బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. అజయ్కుమార్ తరఫున అతడి పీఏ రవికిరణ్, డీసీసీబీ, సుడా మాజీ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్కుమార్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు మల్లేశ్ను అతడి నివాసంలో పరామర్శించారు.
సత్తుపల్లి/వేంసూరు, ఏప్రిల్ 12: కల్లూరు మండలం చండ్రుపట్ల గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు కొమ్మినేని లక్ష్మినారాయణ, వేంసూరు మండలంలోని గొల్లగూడెం గ్రామస్తుడు మల్లెంపాటి నరేంద్ర శుక్రవారం మృతిచెందారు. మృతదేహాలను మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబీకులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 12: మండలంలోని తల్లంపాడు గ్రామానికి చెందిన జిల్లా గౌడ సంఘం సీనియర్ నాయకుడు నల్లమాస వెంకయ్య(75) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతిచెందారు. శుక్రవారం తెలంగాణ గౌడ సంఘం రాష్ట ఉపాధ్యక్షుడు సంపెట వెంకటేశ్వర్లు గౌడ్ నాయకులతో కలిసి వెంకయ్య మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం గౌడ సంఘం అభివృద్ధికి వెంకయ్య చేసిన సేవలను కొనియాడారు. నివాళి అర్పించిన వారిలో సంఘం జిల్లా కార్యదర్శి కుమిలి శ్రీనివాసరావు, ప్రైవేట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పర్సా రమేష్ గౌడ్, సీనియర్ వైద్యుడు బొల్లికొండ శ్రీనివాసరావు, బోడపట్ల వెంకన్న, వడ్డెబోయిన నర్సింహారావు, బోడపట్ల సుదర్శన్, కట్టెకోల వెంకన్న, నరాటి సతీష్, భాస్కర్, నాగేశ్వరరావు, గోపి, ఉపేందర్, వడ్లకొండ శ్రీనివాస్ తదితరులున్నారు.
మధిరరూరల్, ఏప్రిల్ 12: కోఆపరేటివ్ బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) రాష్ట్ర అధ్యక్షుడు నున్న సుందర్రావు తండ్రి కోటయ్య గుండెపోటుతో శుక్రవారం మృతిచెందారు. మండలంలోని బయ్యారం గ్రామంలో ఆయన భౌతికకాయాన్ని డీసీసీబీ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు సందర్శించి నివాళి అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నివాళి అర్పించిన వారిలో బయ్యారం సొసైటీ అధ్యక్షుడు మూల మధుకర్రెడ్డి, మేనేజర్ రాంబాబు తదితరులు ఉన్నారు.