ఖమ్మం: ఖమ్మం నగరపాలక సంస్ధ పరిధిలోని 17వ డివిజన్లో రూ. 30 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో డివిజన్ పరిధిలో సైడ్ డ్రైయిన్ల నిర్మాణంతో పాటు సీసీ రోడ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, కార్పోరేటర్ ధనాల రాధ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఇంచార్జీ నగరపాలక సంస్థ కమీషనర్ స్నేహలత, సహాయ కమీషనర్ మల్లీశ్వరి, డీఈ ధరణీ కుమార్ ఎఈ సతీష్, నాయకులు పాలడుగు పాపారావు, ఆర్జెసీ కృష్ణ పాల్గొన్నారు.