సారపాక/ ములకలపల్లి, సెప్టెంబర్ 14: ముఖ్యమంత్రి కేసీఆరే తమ జీవితాల్లో వెలుగులు నింపారని పోడుదారులు పేర్కొన్నారు. ఆయన నిర్ణయం వల్లనే పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని అన్నారు. పోడు భూములపై హక్కుల కల్పన, పత్రాల పంపిణీ కోసం జీవో 140ని విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
ఈ మేరకు ఆయా గిరిజన గ్రామాలు, ఆదివాసీ గూడేల్లో టీఆర్ఎస్ నాయకులు, ఆదివాసీ ప్రజాప్రతినిధులతో కలిసి పోడు రైతులందరూ బుధవారం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. బూర్గంపహాడ్ మండలం ఇరవెండి గ్రామంలో సర్పంచ్ కొర్సా లక్ష్మి, నాయకుడు రమేశ్, ములకలపల్లి మండలంలో మోరంపూడి అప్పారావు, శెనగపాటి అంజి, మట్ల నాగమణి, నాగళ్ల వెంకటేశ్వరరావు, బండి కొమరయ్య, కరకగూడెం మడలం తాటిగూడెంలో ఉప సర్పంచ్ జాడి నాగరాజు, పోడు రైతులు పాల్గొన్నారు.