ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బిల్లులు సోమవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ నుంచి నిధులను విడుదల చేస్తూ డీఈఓ ఎస్ .యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక పాఠశాలలకు చెందిన మధ్యాహ్న భోజన పథకం నిధులు రూ. 83,52,493లు కాగా ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.58,74,374లు కేటాయించారు.
సెప్టెంబర్, అక్టోబర్ నెలల మీడ్ డే మీల్స్కు చెందిన బిల్లులుగా ఉత్తర్వుల్లో పేర్కోన్నారు. ఎండీఎం బిల్లులతో పాటు పనిచేసే కుక్ కమ్ హెల్పర్స్ వేతనాలు సైతం విడుదల చేశారు. జిల్లాలో కుక్ కమ్ ,హెల్పర్స్ కు రూ.31,06,000లు వారి ఖాతాల్లో జమ కానున్నాయి.