తిరుమలాయపాలెం, జనవరి 29 : బెంగుళూరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తాతా నిఖిల్ చౌదరికి పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. ఆదివారం ఆయన స్వగ్రామమైన పిండిప్రోలులో నిఖిల్చౌదరి సంతాప సభ నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, బంధువులు, స్నేహితులు ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సోదరుడు విశ్వేశ్వరావు కుమారుడు నిఖిల్చౌదరి చిత్రపటం వద్ద వారందరూ నివాళి అర్పించారు.
సత్తుపల్లి, వైరా, ఇల్లెందు, మునుగోడు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములునాయక్, హరిప్రియానాయక్, ప్రభాకర్రెడ్డి, అర్వపల్లి గాంధీ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సీపీఎం రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్రావు, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, సీపీఐ(ఎంల్ఎల్ న్యూడమోక్రసీ) జాతీయ నాయకుడు గాదే దివాకర్ తదితరులు నిఖిల్ చౌదరికి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ బోడ మంగీలాల్, తిరుమలాయపాలెం సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్ చావా వేణు, చామకూరి రాజు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ చావా శివరామకృష్ణ, టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు బాషబోయిన వీరన్న, నాయకులు ఆర్మీ రవి, మట్ట కృష్ణ, అంబేద్కర్, బుద్ద వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.