చింతకాని, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా తీసుకుంటున్న చర్యల ఫలితంగా ప్రభుత్వ బడులన్నీ బాగు పడుతున్నాయని, సకల సదుపాయాలు సమకూరుతున్నాయని, మెరుగైన బోధన అందుతున్నదని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ అన్నారు. మండలంలోని కొదుమూరు, లచ్చగూడెం, చింతకాని తదితర గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను శనివా రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొదుమూరు ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మాణాన్ని, ఇతర మరమ్మతు పనులను పరిశీలించి ఏఈకి సూచనలు చేశారు.
విద్యార్థుల తో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. చింతకాని, లచ్చగూడెం ఉన్నత పాఠశాలల్లో రి కార్డులను తనిఖీ చేశారు. పదోతరగతుల విద్యారులతో ముచ్చటించారు. పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం కావాలన్నారు. ఎంఈవో శ్యాంసన్, హెచ్ఎంలు కుమ్మర నరసింహారావు, పోటు శ్రీనివాసరావు, సూర్యకుమారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.