ఎర్రుపాలెం, జూన్ 26: మధిర జీఆర్పీవోపీ పోలీస్ పరిధిలోని ఎర్రుపాలెం – గంగినేని రైల్వే స్టేషన్ల మధ్యలో నాలుగు రోజుల క్రితం రాత్రిపూట గుర్తుతెలియని వలస కూలీ రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. రైలు పట్టాల నుంచి పకనే ఉన్న కింద కంపలో అతడి మృతదేహం పడి ఉంది. ఎండ తీవ్రతకు అతడి మృతదేహం మొత్తం కరిగి కుళ్లిపోయి పురుగులు పట్టి ఉంది. భీమేన్ ద్వారా మధిర రైల్వే పోలీసులకు ఈ సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలంలో మృతదేహాన్ని పరిశీలించారు.
ఆ మృతదేహాన్ని ఖమ్మం మార్చురీకి తరలించేందుకు ఖమ్మానికి చెందిన అన్నం ఫౌండేషన్ బాధ్యులకు సమాచారం అందించారు. వారు తమ అంబులెన్స్తో ఘటనా స్థలానికి వచ్చి కుళ్లిపోయిన మృతదేహాన్ని ఖమ్మం మార్చురీకి తరలించారు. మృతదేహం వద్ద ఆధార్కార్డు, రెండు సెల్ఫోన్లు, రైల్వే టికెట్ లభించాయి. ఆధార్ కార్డు ప్రకారం మృతుడి పేరు అనిల్కుమార్ అని, అతడిని ఉత్తరప్రదేశ్ అని గుర్తించారు. అతడు చెన్నై వెళ్తున్నట్లుగా అతడి రైలు టికెట్పై ఉంది. అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు, అతడి సహాయకులు పాల్గొన్నారు.