కామేపల్లి: ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. కామేపల్లి మండల పరిధిలోని బర్లగూడెం గ్రామానికి చెందిన బానోత్ పాండు, ధారావత్ రమ్యశ్రీ గత ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురు పెండ్లి చేసుకునేందుకు నిర్ణయించుకుని ఇరువురి కుటుంబ సభ్యులకు తెలుపగా అమ్మాయి తరుపు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో బుధవారం ప్రేమికులిద్దరూ కామేపల్లి పోలీసులను ఆశ్రయించారు. తమకు ప్రాణహాని ఉన్నదని ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రేమికులు పాండు, రమ్యశ్రీ వివాహం చేసుకున్నారు.