సారపాక, జూన్ 27: గ్రామాల అభివృద్ధికి సారపాక ఐటీసీ పీఎస్పీడీ తోడ్పాటు అందిస్తుండడం అభినందనీయమని, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. సారపాకతోపాటు పలు పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం ఐటీసీ సంస్థ తన సీఎస్ఆర్ నిధులను కేటాయించి అభివృద్ధి పనులను చేపడుతుండడం ఎంతో సంతోషకరమని అన్నారు. రూ.20 లక్షల సీఎస్ఆర్ నిధులతో మండలంలోని ఇరవెండి, కోయగూడెం పంచాయతీల్లో రెండు నూతన బస్ షెల్టర్లను ఐటీసీ నిర్మించింది. ఇరవెండిలో విప్ రేగా, కోయగూడెంలో ఎంపీ కవిత సోమవారం వాటిని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం ఈ రెండు గ్రామాల్లో చెరో రూ.10 లక్షలతో బస్ షెల్టర్లను నిర్మించి ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. జడ్పీటీసీ శ్రీలత, ఏఎంసీ చైర్పర్సన్ ముత్యాలమ్మ, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీశ్, ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, సర్పంచ్లు కొర్సా లక్ష్మి, తుపాకుల రామలక్ష్మి, పోతునూరి సూరమ్మ, ఐటీసీ ఉన్నతాధికారులు శ్యామ్కిరణ్, చెంగల్రావు, టీఎన్టీయూసీ నాయకులు కనకమేడల హరిప్రసాద్, గాదె రామకోటిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు జక్కం సుబ్రమణ్యం, కామిరెడ్డి రామకొండారెడ్డి, కొనకంచి శ్రీను, తుపాకుల రవి, గుల్మహ్మద్, బానోత్ శ్రీను, శ్రీహరి, బెజ్జంకి కనకాచారి, తాళ్లూరి రాధాకృష్ణ, సానికొమ్ము శంకర్రెడ్డి, శ్రీహరి, పూర్ణ, పొడియం నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.