ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంల ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
కల్లూరు, నవంబర్ 21 : రైతులకు సంబంధించిన సాగునీరు, నిరంతర విద్యుత్, రైతుసంక్షేమ పథకాలను ఏర్పాటు చేసి రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం కల్లూరులోని కాశ్మీర దైవక్షేత్రం ఆలయ ఆవరణలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని, రైతులకు ఇబ్బందులు లేకుండా గన్నీ బ్యాగులను సకాలంలో అందిస్తున్నారన్నారు. ధాన్యం విక్రయించిన వారం రోజుల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు.
పుల్లయ్య బంజరు సర్పంచ్ పెద్దబోయిన కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, డీఆర్డీఏ పీడీ విద్యాచందన, తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్, ఏపీఎం వెంకటరామారావు, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీ బీరవల్లి రఘు, నాయకులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, ఇస్మాయిల్, వెంకట్లాల్, బోబోలు లక్ష్మణరావు, పెద్దబోయిన మల్లేశ్వరరావు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
వేంసూరు, నవంబర్ 21 : రైతును రాజుగా చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.లచ్చన్నగూడెం సొసైటీ పరిధి మర్లపాడు లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కొత్తూరు ఉమమహేశ్వరరావు, పగుట్ల వెంకటేశ్వరరావు, దొడ్డా శ్రీలక్ష్మి, ముజాహిద్, వీరేశం, సత్యనారాయణ, రంజిత్కుమార్, రామ్మోహన్రావు, చలంచర్ల వెంకటేశ్వరరావు, గండ్ర సోమిరెడ్డి, నాని, కాటే జమలారావు, పాలా వెంకటరెడ్డి, కంటె వెంకటేశ్వరరావు, గుత్తా శ్రీనివాస్, మిరియాల ప్రసాద్, పర్సా కుటుంబరావు, నున్నా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
సత్తుపల్లి రూరల్, నవంబర్ 21 : రైతులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందుగానే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని సొసైటీ అధ్యక్షుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డి అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్ధతు ధర పొందాలని అన్నారు. కొత్తూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే నగదును ఆయా రైతుల ఖాతాల్లో జమచేస్తామన్నారు. కార్యక్రమంలో ఒగ్గు శ్రీనివాసరెడ్డి, పెద్దరెడ్డి పురుషోత్తం, జగ్గారెడ్డి, కొప్పుల నరేందర్రెడ్డి, రామ్మోహనరెడ్డి, సీఈవో జగన్మోహనరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.