ఖమ్మం ఎడ్యుకేషన్/ రఘునాథపాలెం, ఆగస్టు 18: నగరంలోని పలు ప్రైవేట్ విద్యాసంస్థల్లో గురువారం ముందస్తు కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఖమ్మం పాండురంగాపురంలోని బ్లూమింగ్ మైండ్స్ సెంట్రల్ స్కూల్లో గురువారం శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను నిర్వహించారు. ప్రైమరీ విద్యార్థులు చిన్ని కృష్ణుడు, గోపికల వేఫధారణ వేసి చేసిన ఆల్లరి చేష్టలు ఎంతగానో అలరించారు. అనంతరం విద్యార్థులతో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని కళ్లకు కట్టినట్లుగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ బీ.సత్యనారాయణ మాట్లాడుతూ.. చిన్నారులతో ఇటువంటి కార్యక్రమాలు చేయించడం ద్వారా వారిలో మతసామరస్యాన్ని పెంపొందింపవచ్చునని అన్నారు. అనంతరం చిన్నారులకు స్వీట్లు పంచిపెట్టారు వేడుకల సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. కరస్పాండెంట్ పీ.అశోక్రెడ్డి, ప్రిన్సిపాల్ వీ.కిరణ్కుమార్, వైస్ ప్రిన్సిపాల్ జీ.ప్రసాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.