పాల్వంచ/ మణుగూరు రూరల్/ మామిళ్లగూడెం, ఆగస్టు 8: కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న విద్యుత్ సవరణ బిల్లులు -2022కు వ్యతిరేకంగా సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణంలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్), భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (బీటీపీఎస్)కు చెందిన కార్మికులు, ఇంజినీర్లు, ఆర్టీజన్లు, టీఎస్పీఈ (తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్), టీఈఈ (తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్) జేఏసీ, రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి పరిశ్రమల ఎదుట ఆందోళన చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కు తీసుకునేంత వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఖమ్మం నగరంలోని టీఎస్ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్ల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగంలోని విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతున్నదన్నారు. విద్యుత్ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెడుతున్నదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు క్షీణిస్తున్నదన్నారు.
కేంద్రం జీఎస్టీతో ప్రజల నడ్డివిరుస్తున్నదన్నారు. 5జీ స్పెక్ట్రంను ప్రభుత్వ సంస్థకు కట్టబెట్టకుండా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నదని మండిపడ్డారు. నిరసన కార్యక్రమాల్లో టీఆర్వీకేఎస్ నాయకులు తోట కోటేశ్వరరావు, రాంబాబు, రాంబాబు, 1104 సంఘం నేతలు రాజేందర్, కోటేశ్వరరావు, 1535 కార్మిక సంఘం నాయకులు డి.రాధాకృష్ణ, రాము, సాంబయ్య, 327 సంఘం నాయకుడు మజీద్, తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు హీరాలాల్, నాయకులు లక్ష్మీనరసింహారావు, రమణారెడ్డి, సత్యనారాయణరెడ్డి, ప్రసాద్, ఉపేందర్, వంశీ, విక్రమ్, రఘోత్తమ్రెడ్డి, నాగమల్లేశ్వరరావు, బాబూనాయక్, రామారావు, రామకృష్ణ, నరేశ్, నాగార్జున, శ్రీనివాస్, కృపాకర్రావు పాల్గొన్నారు. జేఏసీ నేతలు ప్రసాద్, రాజబాబు, రవిప్రసాద్, నరేశ్, శ్రావణ్, హేమ్లానాయక్, ప్రేమ్కుమార్, సాదిక్, మురళి తదితరులు పాల్గొన్నారు.