ఖమ్మం : జిల్లాలో మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ వీ.పీ.గౌతమ్ సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేకు శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంగన్ వాడీ టీచర్లు నైపుణ్యాలను పెంచుకోవాలని కోరారు. క్షేత్రస్థాయిలో పథకాల పర్యవేక్షణపై ఆయా ప్రాజెక్టుల అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. పిల్లల బరువు తీయటంలో నిర్లక్ష్యం వహించకూడదని ఇలాంటి లోపాలు ఉంటే చర్యలు తప్పవన్నారు.
జిల్లాలో దాదాపు 4,500 మంది పిల్లలు పోషకాహార లోపంతో ఉన్నారని వారందరికీ పర్యవేక్షణతో కూడిన అదనపు పోషకాహారం అందించాలని ఆదేశించారు. ఆయా ప్రాజెక్టులలో దాతలు ఇచ్చిన టీవీలన్ని కేబుల్ కనెక్షన్లతో ఉపయోగించేలా చూడాలని, కరెంట్ సప్లయికి దరఖాస్తు చేసి కనెక్షన్ తీసుకోవాలని, బిల్లులకు సంబంధించిపై అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు. వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ శాఖాధికారి కే.సంధ్యారాణి, జిల్లాలో 7 ప్రాజెక్టుల సీడీపీవోలు, పోషణ్ అభియాన్ జిల్లా కో-ఆర్డినేటర్ హిమబిందు, ఈడీ. ప్రభావతి పాల్గొన్నారు.