ఖమ్మం, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఉద్యమ యోధుడు, అపర భగీరథుడు, పదేళ్లు రాష్ర్టాన్ని పాలించి అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదిన వేడుకలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ, మండల, పట్టణ, నియోజకవర్గ స్థాయిలో ఎక్కడికక్కడ పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, వివిధ వర్గాల ప్రజలు కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. కేసీఆర్ పేరున సేవా కార్యక్రమాలు చేపట్టారు.
వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల్లో అన్నదానాలు, ఆస్పత్రుల్లో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. మొక్కలు నాటారు. బాణాసంచా కాల్చి ‘జై కేసీఆర్.. జైజై కేసీఆర్’ అంటూ నినాదాలు చేస్తూ సంబురాలు చేసుకున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబురంగా జరుపుకున్నారు. భారీ కేక్ను కట్ చేసి నాయకులకు తినిపించారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశారన్నారు.
అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి.. చివరకు తన ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించిన గొప్ప నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బెల్లం వేణుతోపాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. అలాగే అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాల్లో బీఆర్ఎస్ మండల నాయకులు కేసీఆర్ జన్మదిన వేడుకలను సంబురంగా జరుపుకున్నారు. దమ్మపేట మండల కేంద్రంలో జరిగిన వేడుకలకు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. సత్తుపల్లి పట్టణ రింగ్ సెంటర్లో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరయ్యారు.
టేకులపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన వేడుకలకు మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మెర వరప్రసాద్ హాజరై సంబురాల్లో పాల్గొన్నారు. బోనకల్లోని శాంతి నిలయంలో మండల పార్టీ నాయకులు కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. సారపాక మండల కేంద్రంలోని వృద్ధాశ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ జన్మదినం సందర్భంగా వృద్ధులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.
భద్రాచలం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయకులు భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. మణుగూరు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జడ్పీటీసీ పాశం నర్సింహారావు, సిటీ అధ్యక్షుడు లడపా అప్పారావు ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. పాల్వంచ పట్టణంలో జరిగిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కోనేరు చిన్ని ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ఆవరణలో కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ఇల్లెందు జగదాంబ సెంటర్లో 70 కేజీల కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో వివిధ మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర యూత్ ఆధ్వర్యంలో కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వెయ్యి మంది పేదలకు అన్నదానం చేశారు. కారేపల్లి, కొణిజర్లలో మాజీ ఎమ్మెల్యేలు రాములు నాయక్, బానోత్ మదన్లాల్ కేక్ కట్చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. కువైట్లో ఖమ్మం జిల్లా వాసి, బీఆర్ఎస్ పార్టీ కువైట్ ఎన్నారై విభాగం అధ్యక్షురాలు అభిలాష గొడిషాల ఆధ్వర్యంలో మొక్కలు నాటి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.