ఖమ్మం రూరల్, అక్టోబర్ 3: నిరుపేదల గుండెల్లో సీఎం కేసీఆర్ స్థిరస్థాయిగా నిలిచిపోతారని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. మండలంలోని గుదిమళ్ల, వెంకటగిరి, గుర్రాలపాడు, ముత్తగూడెం, తల్లంపాడు, ఆరెంపుల, చింతపల్లి, ఆరెకోడు తండా, కాచిరాజుగూడెం, తనగంపాడు, ఎం.వెంకయపాలెంలో సోమవారం ఆయన కొత్తగా పింఛన్ మంజూరైన లబ్ధిదారులకు పింఛను పత్రాలు అందజేసి మాట్లాడారు. వృద్ధులకు పెద్దకొడుకుగా నిలిచి పింఛను అందజేస్తున్నారన్నారు. నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధే తన ధ్యేయమన్నారు.
నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందంజలో ఉందన్నారు. ప్రజలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పర్యటనలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, ఎంపీపీ బెల్లం ఉమా, జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, సుడా డైరక్టర్ గూడ సంజీవరెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ అక్కినపల్లి వెంకన్న, సొసైటీ డైరెక్టర్ జర్పుల లక్ష్మణ్నాయక్, నాయకులు ముత్యం కృష్ణారావు, ఆంజనేయులు, మట్టా వెంకటేశ్వరరావు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆర్థిక సాయం
ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి సోమవారం వెంకటగిరిలో ఫాతిమా మసీద్ నిర్మాణానికి రూ.2లక్షలు, ఓలీన మిస్టర్స్ చర్చి నిర్మాణానికి రూ.లక్ష, ఆరెకోడు తండాలో రామాలయ నిర్మాణానికి రూ.లక్ష, తనగంపాడులో రామాలయం నిర్మాణానికి రూ.5 లక్షలు, ఎం.వెంకటయపాలేనికి చెందిన యాదవులకు రూ.3 లక్షలు, రజకులకు రూ.3 లక్షలు విరాళంగా అందించారు. నేలకొండపల్లికి చెందిన పడిగల వెంకటేశ్ ఇటీవల మృతిచెందగా బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు, ఇదే గ్రామానికి చెందిన విద్యార్థిని విద్యాభ్యాసానికి రూ.50 వేలు అందజేశారు.