మండల పరిధిలోని కిష్టారం గ్రామానికి చెందిన, సత్తుపల్లి లారీ అండ్ టిప్పర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జ్యేష్ట లక్ష్మణరావు ఇటీవల అనారోగ్యానికి గురై కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ద్వారా సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.4.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ చెక్కును మంగళవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య లక్ష్మణరావుకు అందజేశారు. ఆయన వెంట డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, ఆత్మచైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, మోరంపూడి ప్రసాద్ తదితరులు ఉన్నారు.
మండల పరిధిలోని బోడు కాలనీలో వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం స్వామివారి శాంతి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభించగా సుప్రభాతసేవ, పంచామృతాభిషేకాలు, మంత్రపుష్పం తదితర కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఎన్టీఆర్ కాలనీలో కొలువైన సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో జరిగిన కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే సండ్ర హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఆలయకమిటీ బాధ్యులు దోసపాటి దామోదర్, రంగిశెట్టి మధు, యరమల శ్రీనివాసరెడ్డి, ఓలేటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
జీసస్ చూపిన మార్గంలో పయనించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఐక్య క్రిస్మస్ సంబురాల వాల్పోస్టర్ను ఎమ్మెల్యే సండ్ర మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు.