అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పౌష్ఠికాహారంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం మెరుగుపడిందని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. మారుమూల ప్రాంతాల్లో తాను వైద్యుడిగా పని చేశానని, ఆయా ప్రాంతాల్లో ప్రజలు రక్తహీనతతో ఎక్కువగా బాధపడేవారని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్ఠికాహారాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల వారి ఆరోగ్యం బాగుపడిందన్నారు.
జిల్లాలోని 626 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా.. వాటి ఉత్తర్వుల ప్రతులను అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు, మహిళా సంక్షేమాధికారి వేల్పుల విజేత, అన్ని ప్రాజెక్టుల సీడీపీవోలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.