ఇల్లెందు, డిసెంబర్ 17: ఇల్లెందు పట్టణవాసులు పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇచ్చి స్వచ్ఛ సర్వేక్షణ్లో పట్టణానికి జాతీయస్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు సహకరించాలని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ పిలుపునిచ్చారు. మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో నిర్వహించిన ప్రదర్శనలో ఆమె మాట్లాడారు. ఇప్పటికే పారిశుధ్య విభాగంలో పట్టణం రాష్ట్రస్థాయిలో మొదటిస్థానాన్ని కైవసం చేసుకున్నదన్నారు.
పాలకవర్గం ప్రతిఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకునేలా చొరవ తీసుకున్నదన్నారు. మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పట్టణానికి స్వచ్ఛ మున్సిపాలిటీగా పేరున్నదన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంకూషావలి, ఏఈ శంకర్, కౌన్సిలర్లు కొడకంచి పద్మ, గిన్నారపు రజిత, కుమ్మరి రవీందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లాల్సింగ్, బీఆర్ఎస్ నాయకులు రవి, వీరస్వామి పాల్గొన్నారు.