చింతకాని, జూన్ 20: దళితబంధు పథకం దేశానికే దిక్సూచి అని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. దళితుల్లో అంటరానితనం, పేదరిక నిర్మూలనే దళితబంధు పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు. దళితసాధికారిత సీఎం కేసీఆర్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. మండలంలోని బొప్పారం గ్రామంలో ఐదుగురు లబ్ధిదారులకు దళితబంధు ద్వారా మంజూరైన జేసీబీలు, హార్వెస్టర్లను సోమవారం ఆయా లబ్ధిదారులకు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎంతో ఆదరణ చూరగొంటున్నాయని అన్నారు. దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా చింతకాని మండలం ఎంపికై అన్ని గ్రామాల్లో దళితబంధు ఫలాలు అందుతుండడంతో దళితవాడలు కళకళలాడుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి అజెండాలుగా ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్.. దళితుల అభ్యున్నతి కోసమే దళితబంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. దళితబంధు పథకం ద్వారా దళితుల జీవితాల్లో పెనుమార్పులు తథ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ పీటీ కిశోర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, నాయకులు షేక్ రహమతుల్లా, బోడ్డు వెంకట్రామారావు, గడ్డం శ్రీను, ఇనుకుళ్ల బ్రహ్మారెడ్డి, జోనెబోయిన వీరబాబు, వెంకటేశ్వర్లు, దోబ్బల నాగేశ్వరరావు, దళితసంఘాల నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.