కల్లూరు, జూన్ 20 : ఎస్సీ కార్పొరేషన్ కింద రుణాలు పొందిన లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన రుణాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. మండలంలో 28మంది లబ్ధిదారులకు రూ. 14లక్షల విలువైన చెక్కులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. ఆర్థికంగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేపట్టిన యూనిట్లు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, జిల్లా, మండల రైతుబంధు సమితి సభ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, యూత్ అధ్యక్షుడు పెడకంటి రామకృష్ణ, ఏఎంసీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, మండల కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, ఎంపీడీవో రవికుమార్, లబ్దిదారులు పాల్గొన్నారు.
భూ నిర్వాసితులకు చెక్కులు పంపిణీ..
సత్తుపల్లి మండలంలోని కిష్టారం, అంబేద్కర్ నగర్కు చెందిన దళితులు నూతన రైల్వే లైన్ ఏర్పాటులో కోల్పోయిన 19.4 ఎకరాల అసైన్డ్భూమికి సంబంధించి నష్టపరిహారంగా సింగరేణి సంస్థ ద్వారా మంజూరైన రూ.3.60కోట్ల విలువైన చెక్కులను 35 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పంపిణీ చేశారు. కల్లూరు ఆర్డీవో కార్యాలయ ఆవరణలో లబ్ధిదారులకు సోమవారం అందించారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ బాబ్జి ప్రసాద్, ఏసీపీ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.