కారేపల్లి (కామేపల్లి), అక్టోబర్ 04 : తిరుమల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇద్దరు పేద విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేసి అండగా నిలబడడం అభినందనీయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దిండిగాల రాజేందర్ అన్నారు. కామేపల్లి మండలం ముచ్చర్లకు చెందిన తిరుమల ఫౌండేషన్ అధినేత చల్లా తిరుమల్ రావు శనివారం తన సంస్థ తరఫున ఇల్లెందు పట్టణానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని బత్తుల సాధ్విక, అలాగే ముచ్చర్లకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి రేగళ్ల సందీప్ కు ల్యాప్టాప్ అందజేశారు. పేద విద్యార్థులకు చేయూతను అందించడం పట్ల ఫౌండేషన్ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధినేత చల్లా తిరుమలరావు, ప్రతినిధులు నాగరాజు, సాయికుమార్ పాల్గొన్నారు.
Karepally : నిరుపేద విద్యార్థులకు చేయూత అభినందనీయం : దిండిగాల రాజేందర్