భద్రాచలం, మార్చి 24 : భద్రాచలం నియోజకవర్గ ప్రజలందరూ హోలీ పండుగను ఆనందోత్సహాలతో జరుపుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆకాంక్షించారు. ప్రతిఏడాది కాముని దహనం జరిపిన తరువాత మరుసటి రోజు పౌర్ణమి రోజు హోలీ పండుగను జరుపుకుంటామని తెలిపారు. హోళీ పండుగను సహజమైన రంగులతో తయారు చేసిన నీటిని చల్లుకోవాలని, ఆర్టిపిషియల్ రంగులతో తయారు చేసిన నీటిని చల్లుకోవద్దని అన్నారు. రంగులు చల్లుకున్న తరువాత ఇంటి వద్దనే స్నానాలు చేయాలని, వాగులు, చెరువులు, గోదావరి వద్దకు వెళ్లి స్నానాలు చేయకూడదని అన్నారు. అదేవిధంగా ఇంటర్మీడియేట్ పరీక్షలు అయిపోవడంతో విద్యార్థులు సరదాగా గోదావరిలోకి ఈతకు వెళుతుంటారని, తల్లిదండ్రులు వారిని ఈతకు వెళ్లకుండా చూడాలన్నారు.