Photography | తెలంగాణలోని జిల్లా కేంద్రం ఖమ్మం పట్టణవాసి తగరం సందీప్ కుమార్ (శాండీ) రెండో సారి జాతీయస్థాయి ఫొటోగ్రఫీలో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. ఒడిశాలో జరిగిన హుస్సేన్ ఖాన్ 5వ జాతీయ స్థాయి వర్క్షాప్లో శాండీ తొలి స్థానంలో నిలిచాడు. వివిధ రాష్ట్రాల నుంచి ఈ వర్క్షాప్కు హాజరైన 40 మంది ఫొటోగ్రాఫర్లు వివిధ క్యాటగిరీల్లో పోటీ పడ్డారు.
స్పాట్ ఫొటో కాంపిటీషన్లో ఖమ్మం పట్టణ వాసి తగరం సందీప్కుమార్ మొదటిస్థానంలో నిలిచాడు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ హుస్సేన్ఖాన్ చేతుల మీదుగా సందీప్ కుమార్ ఈ అవార్డు అందుకున్నాడు. గతంలో జరిగిన జాతీయస్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో సందీప్కుమార్ బంగారు పతకాలతో పాటు, నగదు పురస్కారాలను అందుకున్నాడు. స్పాట్ ఫొటోగ్రఫీలో మొదటిస్థానంలో నిలిచిన సందీప్కుమార్ను ఖమ్మం ఫొటోగ్రాఫర్లు అభినందించారు.