ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, వేదపండితులు ఉప్పల సుదర్శనశాస్త్రీ, అర్చకులు రామకృష్ణశాస్త్రీ, సూపరిండెంట్ బీ.శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ కే.విజయకుమారి, భక్తులు పాల్గొన్నారు.