రామవరం, డిసెంబర్ 24: కార్మికులు, అధికారులు సమష్టిగా కృషి చేస్తే.. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించవచ్చని సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం జక్కం రమేష్ అన్నారు. సింగరేణి డే వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి రుద్రంపూర్ ప్రగతి వనంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ముగింపు వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ నెల 20వ తేదీన అత్యధికంగా 54,902 టన్నుల బొగ్గును రవాణా చేసి రికార్డు నెలకొల్పినట్లు చెప్పారు. ఉత్తమ అధికారులను సన్మానించి జ్ఞాపికలను అందించారు. వీటిని అందుకున్న వారిలో అడిషనల్ మేనేజర్ (ఎస్టేట్స్) రామకృష్ణ, డిప్యూటీ మేనేజర్ (ఏవీఆర్ వోసీ) గౌతమ్, పీవో రాజేష్రెడ్డి ఉన్నారు. ఉత్తమ ఎన్సీడబ్ల్యూవో కేటగిరీలో లవణ్కుమార్, ఈపీ ఆపరేటర్ భూక్యా సక్రు.. సన్మానం, జ్ఞాపిక అందుకున్నారు. వివిధ పోటీల విజేతలకు బహుమతులను అతిథులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం నాయకుడు ఎండీ రజాక్, అధికారులు పాలడుగు శ్రీనివాస్, రమేష్, ఆర్.నారాయణరావు, సూర్యనారాయణ, రవీందర్, కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు, యోహాన్, రాజశేఖర్, బులి మాధవ్, శర్మ, సదానందం, మదన్మోహన్, సత్యనారాయణ, కిరణ్బాబు, మజ్జి మురళి, సుధాకర్, ఎం.శ్రావణ్కుమార్, అజయ్, రమణారెడ్డి, డాక్టర్ పరశురాములు, పోగుల సత్యనారాయణ పాల్గొన్నారు.