ఖమ్మం : స్వాతంత్య్ర సమరయోధుడు యరమల కోటారెడ్డి(93) గుండెపోటుతో కన్నుమూశారు. జమలాపురంగ్రామంలోని వారి నివాసంలో మృతి చెందారు. స్వాతంత్య్ర సమరంలో తనవంతు పాలుపంచుకున్న ఆయన పెదగోపవరం గ్రామానికి సర్పంచ్ గా పనిచేశారు. అంతేకాకుండా
జమలాపురంలో ఉన్న బాలాజీ భవన నిర్మాణానికి ఎకరం పది కుంటల భూమిని దానం చేశారు యరమల కోటారెడ్డి.
ఆయనకు ఓ కుమార్తె ,కుమారుడు ఉన్నారు. పలు రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు కోటారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మనువడు యరమల సత్యనారాయణరెడ్డి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు.