ఖమ్మం, అక్టోబర్ 21 : ఖమ్మం నగరంలో రూ.1.60 కోట్లతో జరుగనున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ శుక్రవారం మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నగరాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
సీసీ రోడ్లు, డ్రైన్లు, సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, పారులు ఏర్పాటు చేసి సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. 24వ డివిజన్ కాశయ్య కాలనీలో రూ.25 లక్షలు, 40వ డివిజన్ జమ్మిబండ రోడ్డులో రూ.45 లక్షలు, 42వ డివిజన్ నిజాంపేటలో రూ.45 లక్షలు, 43వ డివిజన్ నెహ్రూనగర్లో రూ.45 లక్షలు మొత్తం రూ.1.60 కోట్లతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, కమర్తపు మురళి, దాదే అమృతమ్మ సతీశ్, పాకాలపాటి విజయ శేషగిరిరావు, బీజీ క్లెమెంట్, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రంజిత్, డీఈలు స్వరూపరాణి, నవ్యజ్యోతి, రంగారావు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు.