సత్తుపల్లి టౌన్, ఫిబ్రవరి 11: ప్రముఖ సినీనటుడు తొట్టెంపూడి వేణు తండ్రి తొట్టెంపూడి వెంకటసుబ్బారావు ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హైదరాబాద్లోని ఆయన నివాసానికి ఆదివారం వెళ్లి పరామర్శించారు.
తొలుత వెంకటసుబ్బారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.