తల్లాడ, ఆగస్టు 27: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు రూ.4,016 పింఛన్ ఇస్తూ వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం తల్లాడలోని ఆర్బీ.గార్డెన్ ఫంక్షన్హాల్లో 1,177 మంది దివ్యాంగులకు ప్రభుత్వం పెంచిన రూ.4,016 ప్రొసీడింగ్ పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రూ.600 కంటే ఎక్కువ ఇవ్వడం చేత కాని వారు తెలంగాణలో మాత్రం పింఛన్ రూ.4 వేలు ఇస్తామని మాయమాటలు చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే మాయమాటలు నమ్మి మోస పోవద్దన్నారు. దివ్యాంగులు అడగకపోయినా రూ.3,016 నుంచి రూ.4,016 పింఛన్ పెంచిన గొప్ప మనస్సున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దుగ్గిదేవర వెంకట్లాల్, వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దూపాటి భద్రరాజు, ఎంపీడీవో కొండపల్లి శ్రీదేవి, నాయకులు చల్లా తిరుమలదేవి, శీలం కోటారెడ్డి, తూము శ్రీనివాసరావు, జొన్నలగడ్డ కిరణ్బాబు, కోసూరి వెంకటనరసింహారావు, ఓబుల సీతారామిరెడ్డి, మాగంటి కృష్ణయ్య, తూము వీరభద్రరావు, కోడూరి వీరకృష్ణ, శెట్టిపల్లి లక్ష్మణరావు, మోదుగు కృష్ణ, కేతేపల్లి చలపతిరావు, బద్ధం కోటిరెడ్డి, నాయుడు శ్రీనివాసరావు, దిరిసాల దాసురావు, జీ.వీ.ఆర్, గుంట్ల వెంకటి, బొడ్డు వెంకటేశ్వరరావు, మోదుగు ఆశీర్వాదం, షేక్ హుస్సేన్, సంఘసాని శ్రీనివాస్, చల్లా నాగులు, తేళ్లూరి పాల్గొన్నారు.
దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచిన ఏకైక సీఎం కేసీఆర్
కల్లూరు, ఆగస్టు 27: సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశామ ఎమ్మెల్యే సండ్ర అన్నారు. ఆదివారం స్థానిక మార్కెట్ కమిటీ ఆవరణలో మండలంలోని 1139 మంది లబ్ధిదారులకు పెంచిన పింఛన్ ప్రొసీడింగ్స్ పత్రాలను ఆయన అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ 50 ఏళ్లు పాలించి రూ.200 పింఛన్ ఇచ్చిందని, నేడు సీఎం కేసీఆర్ రూ.4,016 ఇచ్చి దివ్యాంగులకు భరోసా కల్పిస్తున్నారని అన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి బీఆర్ఎస్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. అనంతరం ముస్లిం మైనార్టీ మస్జీద్ సదర్గా ఎన్నికైన హనీఫ్, ముస్లిం పెద్దలు ఎమ్మెల్యే సండ్రను శాలువాతో సత్కరించారు. కల్లూరు ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారి కల్లూరుకు విచ్చేసిన ఎమ్మెల్యే సండ్రను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం సహఫంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రవికుమార్, ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్బాబు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, లక్కినేని రఘు, పసుమర్తి చందర్రావు, బోబోలు లక్ష్మణరావు, ఎండీ ఇస్మాయిల్, రామకృష్ణ, వెంకటేశ్వరరావు, నాయకులు ఊడల కృష్ణమూర్తి, దివ్యాంగులు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.