వైరాటౌన్, డిసెంబర్30 : వైరా టీఎన్జీవోస్ తాలూకా యూనిట్ భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు షేక్ అఫ్జల్ హసన్ ఆధ్వర్యంలో వైరా తాలూకా యూనిట్ అధ్యక్షురాలు స్వప్న, యూనియన్ బాధ్యులతో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందించారు. స్పందించిన ఎమ్మెల్యే రాములునాయక్ తన నిధుల నుంచి యూనిట్ కార్యాలయం నిర్మాణానికి తక్షణ సహాయంగా రూ.5 లక్షలను మంజూరు చేస్తూ కలెక్టర్కి లేఖ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు నందగిరి శ్రీను, షేక్ నాగుల్మీరా, భాగం పవన్, శాబాసు జ్యోతి, స్వప్న, సవర్జన్పాల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
ఏన్కూరు మండలంలోని గార్లవొడ్డు గ్రామ లక్ష్మీనర్సింహాస్వామి ఆలయంలో ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈవో శేషయ్య ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు.