చింతకాని, డిసెంబర్ 28: దళితబంధు యూనిట్లతో లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి అన్నారు. బుధవారం ఆమె పాతర్లపాడులో లబ్ధిదారులకు అందజేసిన యూనిట్లను పరిశీలించి మాట్లాడారు. ఆదాయం, ఖర్చుల గురించి ఆరా తీశారు. డెయిరీ యూనిట్ల పర్యవేక్షణకు పశువైధ్యాధికారులను నియమించామని, వారు మండలంలోని యూనిట్లను పరిశీలిస్తారన్నారు.
రాజకీయాలకు అతీతంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. పర్యటనలో మండల పశువైధ్యాధికారి ఉప్పు శ్రీహరి, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్, సర్పంచ్ కాండ్ర పిచ్చయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్, కార్యదర్శులు పల్లపు రవీందర్, అనిల్కుమార్, షేక్ సైదులు, మహేశ్ ఉన్నారు.