కొత్తగూడెం అర్బన్, మార్చి 12 : తమ అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధ) ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట మండుటెండలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేశ్, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పద్మ మాట్లాడారు. అంగన్వాడీ టీచర్లకు 5జీ ట్యాబ్లు ఇవ్వాలని, మే నెలలో టీచర్లు, హెల్పర్లకు ఒకేసారి వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టిస్తోందని ఆరోపించారు. అంగన్వాడీ కేంద్రాలకు చీపుర్లు, వంట పాత్రల వంటి కనీస సౌకర్యాలు కల్పించాల్సిందిపోయి.. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానాలను ప్రవేశపెట్టడం సరికాదన్నారు. కార్యక్రమంలో బ్రహ్మచారి, వీరన్న, సత్య, భూక్యా రమేశ్, పాయం రాధాకుమారి, విజయ, కళావతి, రాధ, సూరమ్మ, హేమలత, కృష్ణవేణి, లలిత, మరియ, అచ్చమ్మ, రమ్య, శకుంతల, సారమ్మ, ఫాతిమా, సావిత్రి, నిర్మల, భవాని, వరలక్ష్మి పాల్గొన్నారు.