చండ్రుగొండ: రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కుడారై ఉత్సవం నిర్వహించారు. కుడారై ఉత్సవం సందర్బంగా 108 గంగాలాలతో పాయసాన్ని భక్తులు స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. వేదపండితులు వివిఆర్కె మూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.