ఎర్రుపాలెం : తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రోత్సవాలు శనివారం మూడోరోజుకు చేరుకున్నాయి. ప్రాతఃకాల అర్చనల అనంతరం యాగశాలలో అమ్మవారిని గాయత్రి అమ్మవారిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. గోపూజ, భక్తకళ్యాణం నిర్వహించి ప్రత్యేక పంచామృత స్నపనం జరిపారు. ఈ కార్యక్రమంలో ఈవో కే.జగన్మోహన్రావు,ధర్మకర్త ఉప్పల కృష్ణమోహనశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, పర్యవేక్షకులు బీ.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.