వైరారూరల్, నవంబర్ 1 : సీఎం కేసీఆర్తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మంగళవారం ఆయన సిరిపురం, పుణ్యపురం గ్రామాల్లో రూ.61 లక్షలతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టిన ప్రతి సంక్షేమ పథకం, అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందేవరకు సేవకుడిగా, మీలో ఒకడిగా ఉంటానని పేర్కొన్నారు.
పుణ్యపురం- కేశవాపురం మధ్యలో బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. రెండు గ్రామాల్లో ఎమ్మెల్యేకు మేళతాళాలు, ఊరేగింపుతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ బీడీకే రత్నం, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, ఎంపీటీసీ కృష్ణారావు, తహసీల్దార్ అరుణ, డీటీ రాము, ఎంపీవో జ్యోత్స్న, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు షేక్ లాల్మహ్మద్, బాణాల వెంకటేశ్వరరావు, పీఆర్డీఈ చంద్రు, కట్టా కృష్ణార్జున్రావు, మచ్చా నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.