వైరా రూరల్, జనవరి 7: మల్లు భట్టివిక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి తొలిసారి ఆయన స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురానికి విచ్చేశారు.
వారికి ఎమ్మెల్యే రాందాస్నాయక్తో పాటు గ్రామస్తులు స్వాగతం పలికారు. గ్రామంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం తల్లిదండ్రులు అఖిలాండేశ్వర్రావు, మాణిక్యమ్మ, సోదరుడు అనంతరాములు సమాధుల వద్ద నివాళి అర్పించారు.