ఖమ్మం, నవంబర్ 30: నగరంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలను కూల్చివేయాలని కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి టౌన్ ప్లానింగ్ అదికారులను ఆదేశించారు. ఖమ్మం నగరంలోని బుధవారం ఆయన పర్యటించి పలు భవనాల నిర్మాణాలను పరిశీలించారు. బైపాస్ రోడ్డులో నూతన బస్టాండ్ ఎదురుగా నిర్మిస్తున్న రెస్టారెంట్కు అనుమతులు లేవని అన్నారు. గతంలో నోటీసులిచ్చినా దాని యజమానులు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోలేదని అన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్న ఆ భవనాన్ని వెంటనే తొలగించాలని ఆదేశించారు. అదేవిధంగా బైపాస్రోడ్లో బీపీసీఎల్ బంక్ ఎదుట నిర్మిస్తున్న భవనానికి కూడా అనుమతులు లేనందున దాని యజమానులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. డీసీపీ వికాస్, టీపీఎస్ సాయిరాం, టీపీవో నరేశ్, ఏసీపీ వసుంధర తదితరులు పాల్గొన్నారు.