కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో పెంచుతున్న మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పోస్టాఫీస్రోడ్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు స్పైటల్ బాల్ మొక్కలు నాటారు. ఇవి వాహనదారులు, ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.
ఈ మొక్కలను కడియం నుంచి తీసుకొచ్చి నాటారు. ఒక్కో మొక్క ఖరీదు రూ.15వేలకు కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. భద్రాద్రి జిల్లాలో ఇంత వరకు ఏ మండలంలో, మున్సిపాలిటీలో ఈ మొక్కలు నాటలేదు. మొట్టమొదటిసారిగా కొత్తగూడెంలో నాటారు.
– కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 15