సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవాలకు గురువారం కొత్తగూడెం విచ్చేసిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
కలెక్టరేట్లో నిర్వహించిన సభకు భారీగా ప్రజలు తరలివచ్చారు. ఉద్యమ నేతకు జేజేలు పలికారు.. తమ అభిమానాన్ని చాటుకున్నారు. – నెట్వర్క్