ఖమ్మం సిటీ, డిసెంబర్ 31: హైదరాబాద్లోని రవీంద్రభారతిలో ఆదివారం మెగాసిటీ నవకళా వేదిక వార్షికోత్సవం సందర్భంగా ఖమ్మంలోని కావ్య హాస్పిటల్ సీఈవో డాక్టర్ కావ్యచంద్ యాలమూడికి ‘వైద్యశ్రీ’ పురస్కారాన్ని అందించింది. వైద్యరంగంలో ఎండోక్రైనాలజీ, మధుమేహం, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్ విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతి ద్వారా అందిస్తున్న వైద్య సేవలకు గాను ఆమె శాసన మండలి డిఫ్యూటీ చైర్మన్ ప్రకాష్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, సరస్వతీ ఉపాసకుడు దైవజ్ఞశర్మ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. కార్యక్రమంలో కావ్య హాస్పిటల్స్ చైర్మన్ రవీందర్ యాలమూడి పాల్గొన్నారు.