కారేపల్లి, మార్చి 28 : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా పని చేయాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్లాల్ అన్నారు. కారేపల్లి క్రాస్రోడ్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు స్వప్రయోజనాల కోసం పార్టీని ఉపయోగించుకున్న కొందరు అవకాశవాదులు ఇప్పుడు పార్టీని వీడుతున్నారని, అలాంటి వారు వెళ్లినా పార్టీకి నష్టమేమీ లేదన్నారు. అధికారంలో ఉన్నా, లేకున్నా ఎల్లప్పుడూ కార్యకర్తలకు అందుబాటులో ఉండి అండగా నిలుస్తానని ధైర్యం చెప్పారు.
అనంతరం గేట్ రేలకాలపల్లి, బోటితండా, చీమలపాడు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, ఎంపీటీసీ శంకర్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నం వీరేందర్, తాతా వెంకన్న, జడల వెంకటేశ్వర్లు, డొంకెన రవీందర్, ఎస్కే.గౌసుద్దీన్, పాటి రాంబాబు, రవీందర్రెడ్డి, సైదులు, ధరావత్ వికాస్, బానోత్ రాజేశ్, స్వామి, చందు, హతీరాం, గణితి సత్యం, ముత్యాలరావు, మధు, రవికుమార్, శంకర్, బావ్సింగ్, వెంకటేశ్ పాల్గొన్నారు.