బోనకల్లు, జనవరి 13: ఈ నెల 18న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని వనంవారి కృష్ణాపురంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రతి నాయకుడు, కార్యకర్త బాధ్యత తీసుకుని సభకు ప్రజలు వచ్చేలా చూడాలన్నారు. కార్యక్రమంలో పార్టీముదిగొండ మండల అధ్యక్షుడు వాచేపల్లి లక్ష్మారెడ్డి, ముదిగొండ సొసైటీ చైర్మన్ తుపాకుల యలగొండ స్వా మి, వనంవారి కృష్ణాపురం నాయకులు పాల్గొన్నారు.
సభను విజయవంతం చేయాలి
బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విజయవంతం చేయాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు కోరారు. బోనకల్లు, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో ఆయన ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రతి గ్రామం నుం చి వందలాదిగా తరలించే బాధ్యత ప్రతి నాయకుడు తీసుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.
సభ సక్సెస్ చేయాలి: జనగామ జడ్పీ చైర్మన్
ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ను విజయవంతం చేయాలని జనగామ జడ్పీ చైర్మన్, పార్టీ పాలేరు నియోజకవర్గ ఇన్చార్జి పాగల సంపత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. మండలంలోని నర్సింహులగూడెం, గోరీలపాడుతండా, జుజ్జల్రావుపేట, మల్లాయిగూడెం గ్రామాల్లో శుక్రవారం నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. సమావేశాల్లో ఎంపీపీ బానోత్ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేముల వీరయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.
సభకు స్వచ్ఛందంగా తరలిరావాలి: జడ్పీ చైర్మన్
ఈ నెల 18న ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు పల్లెల్లోని యువత, మహిళలంతా స్వచ్ఛందంగా తరలిరావాలని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం మండలంలోని రామకృష్ణాపురం, బస్వాపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన సన్నాహక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఏర్పాటుచేస్తున్న తొలి సభ కావడంతో యావత్ దేశం చూపు ఖమ్మంపై ఉన్నదని, సభను దిగ్విజయం చేయాలని కోరారు. నాయకులు పెంట్యాల పుల్లయ్య, కురుగుంట్ల రవీందర్రెడ్డి, కోపూరి పూర్ణయ్య, గురజాల హనుమంతరావు, కన్నెబోయిన కుటుంబరావు, మంకెన రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మధిర టౌన్..
ఈ నెల 18న ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. శుక్రవారం మధిర మున్సిపాలిటీలో పరిధిలోని 11వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో మధిర మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, బీఆర్ఎస్ నాయకులు మొండితోక జయాకర్, పల్లపోతుల వెంకటేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, వార్డు కౌన్సిలర్ గద్దల మాధురి తదితరులు పాల్గొన్నారు.