ఖమ్మం సిటీ/కూసుమంచి, మార్చి 21 : ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్నాయక్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం జిల్లాను సందర్శించిన ఆయన తొలుత కూసుమంచి పీహెచ్సీకి వెళ్లి ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఐడీవోసీలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు డీఎంహెచ్వో డాక్టర్ బీ మాలతి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అక్కడి మీటింగ్ హాలులో జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన.. మాతా, శిశు, ఇమ్యూనైజేషన్, జాతీయ ఆరోగ్య మిషన్, జాతీయ కీటక జనిత రోగ నివారణ, జాతీయ కుష్ఠు నివారణ, అసంక్రమణ వ్యాధుల నివారణ వంటి ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రోగ్రాం అధికారులు నిబద్ధతతో పని చేస్తేనే ప్రజలకు అద్భుతమైన వైద్య సేవలు అందుతాయన్నారు. ఆరోగ్య కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేసి.. జిల్లాను అగ్రగామిగా నిలపాలని సూచించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ సీ సెక్షన్ ఆపరేషన్లు తగ్గించి సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ సైదులు, డాక్టర్ సీతారాం, డీఐవో డాక్టర్ ప్రమీల, డాక్టర్ చందూనాయక్, డీఎల్వో డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ భాస్కర్నాయక్, డెమో కాశీనాథ్, ఎన్హెచ్ఎం డీపీవో నీలోహన తదితరులు పాల్గొన్నారు.